మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు ..... రామాయణంలో 24,000 శ్లోకములు ఉన్నాయి. అవి 7 కాండములు, 500 సర్గలుగా విభజింపబడ్డాయి. రామాయణ ములోని శ్లోకములు అనుష్టుప్ ఛందస్సులో రాయ బడ్డాయి. అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ.11వ శతాబ్దమునకు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

  
  


 

 

 

రామాయణం చదవాలనే ఆసక్తి అందరిలోను పెరగాలనే సదుద్దేశ్యంతో ప్రాథమిక విజ్ఞానం కోసం తయారు చేయబడిన కొన్ని ప్రశ్నలు మాత్రమే ఇవి.. మీకు నచ్చితే మీ బంధుమిత్రులకు కూడా పంపండి...

Page:01    Page:02       Page:03       Page:04      

రామాయణం ఏముంది?:

108 ప్రశ్నలు –జవాబులతో.


1. శ్రీ మద్రామాయణము రచించిన మహర్షి ఎవరు?
జ.) వాల్మీకి.

2. వాల్మీకి మహర్షికి రామాయణ గాథను ఉపదేశించిన ముని ఎవరు?
జ.) నారదుడు.

3. రామకథను వినిన తర్వాత వాల్మీకి మహర్షి, మధ్యాహ్న స్నానానికి ఏ నదికి వెళ్లాడు?
జ.) తమసా నది.

4. శ్రీమద్రామాయణంలో మొత్తం ఎన్ని శ్లోకాలు వున్నాయి?
జ.) 24,000.

5. శ్రీమద్రామాయణాన్ని గానము చేస్తూ మొదట ప్రచారం చేసిందెవరు?

జ.) కుశలవులు.

6. అయోధ్యా నగరం ఏ నది ఒడ్డున ఉన్నది?
జ.) సరయూ నది.

7. అయోధ్య ఏ దేశానికి రాజధాని?
జ.) కోసల రాజ్యం.

8. దశరథ మహారాజుకు ఆంతరంగికుడైన మంత్రి ఎవరు?
జ.) సుమంత్రుడు.

9. దశరుథుని భార్యల పేర్లు ఏమిటి?
జ.) కౌసల్య, సుమిత్ర, కైకేయి.

10. సంతానం కోసం దశరథుడు చేసిన యాగం పేరు?
జ.) పుత్రకామేష్ఠి.

11. యజ్ఞకుండమునుండి వెలువడిన దివ్య పురుషుడు ఇచ్చిన పాయసాన్ని దశరథుడు తన భార్యలకు ఎట్లు పంచెను?
జ.) కౌసల్యకు 50%, సుమిత్రకు 25%, కౌకేయికి 12.5%, మిగిలిన 12.5% మళ్లీ సుమిత్రకు.

12. బ్రహ్మదేవుని ఆవలింత నుండి పుట్టిన వానరుడెవరు?
జ.) జాంబవంతుడు.

13. వాలి ఎవరి అంశతో జన్మించెను?
జ.) దేవేంద్రుడు.

14. వాయుదేవుని వలన జన్మించిన వానరుడెవరు?
జ.) హనుమంతుడు.

15. కౌసల్య కుమారుని పేరేమిటి?
జ.) శ్రీరాముడు.
16. భరతుని తల్లి పేరేమిటి?
జ.) కైకేయి.
17. రామలక్ష్మణ భరత శత్రుఘ్నలలో కవలలు ఎవరు వారి తల్లి పేరేమిటి?
లక్ష్మణ, శత్రుఘ్నులు- తల్లి సుమిత్ర.

18. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులకు నామకరణము చేసిన మహర్షి ఎవరు?
జ.) వసిష్ఠుడు.

19. విశ్వామిత్రుడు వచ్చేనాటికి రాముని వయస్సు?
జ.) 12 సంవత్సరములు.

20. విశ్వామిత్రుని యజ్ఞానికి విఘ్నాలను కల్పిస్తున్న రాక్షసులెవరు?
జ.) మారీచ, సుబాహులు.

21. రామునికి అలసట, ఆకలి లేకుండా వుండుటకు విశ్వామిత్రుడు ఉపదేశించిన మంత్రం పేరేమిటి?
జ.) బల-అతిబల.
22. విశ్వామిత్రుని ఆశ్రమం పేరు?
జ.) సిద్ధాశ్రమం.

23. తాటక భర్త పేరేమిటి?
జ.) సుందుడు.

24. తాటకను శపించిన మహర్షి ఎవరు?
జ.) అగస్త్యుడు.
25. గంగను భూమికి తెచ్చుటకు తపస్సు చేసినదెవరు?
జ.) భగీరథుడు.

26. గంగకు జాహ్నవి అనే పేరు ఎందుకు వచ్చెను?
జ.) జహ్ను మహర్షి చేత త్రాగివేయబడుటచే.

Page:01    Page:02      Page:03       Page:04